దేశవ్యాప్తంగా నిర్మాణ రంగానికి గట్టి షాక్ ఇస్తూ రేపటి నుంచి సిమెంట్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఒక్కో బస్తాపై సుమారు రూ. 30 నుండి రూ. 50 వరకు పెంచుతున్నట్లు సిమెంట్ తయారీ కంపెనీల నుంచి డీలర్లకు సమాచారం అందింది. దీంతో ప్రముఖ కంపెనీల సిమెంట్ బస్తా ధర మార్కెట్లో రూ. 360 కి చేరుకునే అవకాశం ఉంది.

ఈ ధరల పెరుగుదల నేపథ్యంలో సిమెంట్ కంపెనీలు ఈరోజు బుకింగ్స్ను నిలిపివేశాయి. నిన్నటి వరకు ఉన్న పాత ధరలకే బుకింగ్లు స్వీకరించిన కంపెనీలు, ఇకపై కొత్త ధరలకే విక్రయాలు జరపాలని నిర్ణయించాయి.సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్) మరియు నిర్మాణ పనులు ఊపందుకునే వేసవి కాలంలో డిమాండ్ను బట్టి కంపెనీలు ధరలు సవరిస్తుంటాయి. అయితే, ముడి సరుకుల రవాణా ఖర్చులు పెరగడం కూడా ఈ ధరల పెంపునకు ఒక కారణమని తెలుస్తోంది. ఈ హఠాత్తు నిర్ణయంతో ఇళ్లు కట్టుకునే సామాన్యులపై మరియు బిల్డర్లపై అదనపు ఆర్థిక భారం పడనుంది.
