
కంభం పట్టణం అర్బన్ కాలనీకి చెందిన షేక్ ఆఫ్రిద్ తన రెండేళ్ల కుమార్తెకు అనారోగ్యంగా ఉండటంతో స్థానిక మల్లికార్జున హాస్పిటల్కు తీసుకెళ్లారు. అయితే, అక్కడ వైద్యులు సూచించిన సిరప్ను వాడిన కొద్దిసేపటికే పాప పరిస్థితి విషమించి, వరుసగా వాంతులు మరియు విరేచనాలు అయ్యాయి.
ఆందోళనతో తల్లిదండ్రులు మందు బాటిల్ను గమనించగా, అది గడువు ముగిసిన (Expired) మందు అని తెలిసి షాక్కు గురయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల పసిపాప ప్రాణాలు ప్రమాదంలో పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం ఆ పాప ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఇంతటి దారుణానికి ఒడిగట్టిన హాస్పిటల్ యాజమాన్యంపై మరియు బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
